జీతే రహో త్రిపురాజీ !
" మన అలజడి, అశాంతి, ఆవేదన, ఆకాంక్షల బావిలోంచి బయటికిలాగికొండ అంచున నిలబెట్టి దిగువ అగాధాన్నీ పైన అనంతాన్నీ చూపించి
మన వస్తు ప్రపంచాన్ని ముక్కలుచేసి వదులుతాడు త్రిపుర "
అర్థం కావడానికీ, విశ్లేషణకీ అతీతమయిన కథల్లో త్రిపుర కథలు చేరతాయి. అవి మామూలుగా అర్థంకావు. కాకుండా జాగ్రత్త పడ్డాడాయన.
కేవలం 14 కథలతో తెలుగు కథాప్రపంచాన్ని తలకిందులు చేశాడు త్రిపుర.
వాచీలకు అతీతమయిన కాలం గురించి, బహుశా ఒక భారరహిత స్థితి గురించి త్రిపుర పలవరిస్తాడనుకుంటాను.
కాఫ్కా ప్రాపంచిక దృక్పథం త్రిపురని తీవ్రంగా ప్రభావితం చేసింది.
జీతే రహో త్రిపురాజీ !
‘‘జ్ఞాపకాల ముక్కల అస్తవ్యస్తపు సముదాయమే జీవితం.’’
ప్రాథమికంగా ఈ అనంత కాలవాహినిలో మనిషి ఉనికి గురించి త్రిపురకేర్పడిన ఎరుక ఆయన కథలు.
విశాఖ మాండలికంలో తెలుగుతనం మెరిసిపోయే మెటఫర్ త్రిపుర కథల విలక్షణత
కలవడం, విడిపోవడం, పోగొట్టుకోవడం, నిరీక్షించడం అనే నాలుగు బిందువుల మధ్య జీవితం నిర్విరామంగా తిరుగుతూ ఉంటుంది.
రెండు వాక్యాలలో కుదించి గుండెని ఒక్కసారి పిడికిట్లో బిగించి వదిలేస్తాడు త్రిపుర.
No comments:
Post a Comment